VIDEO: రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి
WGL: గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని వారు వ్యాఖ్యనించారు.