శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
NDL: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా తరలి వస్తున్న మల్లన్న భక్తులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దోర్నాల గణపతి చెక్ పోస్ట్ వద్ద 2km మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దోర్నాల వైపుగా తరలి వస్తున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నట్లు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్కి సహకరించాలని కోరారు.