ప్రజా ఉద్యమాలకు CITU విరాళాల సేకరణ
W.G: ప్రజల నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయి ప్రజా ఉద్యమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు CITU రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు అన్నారు. మంగళవారం భీమవరంలో CITUఅఖిలభారత మహాసభల జయప్రదం కోసం ఇంటింటా నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికులకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదన్నారు. దానికోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.