నేడు మామిడి రైతుల సమావేశం

నేడు మామిడి రైతుల సమావేశం

CTR: పలమనేరు పట్టణం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గురువారం మామిడి రైతుల సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంఘం ఉపాధ్యక్షులు ఉమాపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతుల సమస్యలు, మామిడికి గిట్టుబాటు ధర తదితర విషయాలపై చర్చిస్తామన్నారు. అనంతరం మండలాల వారీగా మామిడి రైతుల సంఘాల ఎన్నిక ఉంటుందని తెలిపారు.