VIDEO: సికింద్రాబాద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం

HYD: ముస్లింలు పవిత్ర మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదం సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం సికింద్రాబాద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.