భారత్కు చేరాల్సిన ఇరాన్ చమురు.. చైనాకు
భారత్కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళుతున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ పేర్కొంది. ఈనెల 4న గుజరాత్లోని వడినర్ నౌకాశ్రయానికి ఈ నౌక చేరుకోవాల్సి ఉంది. అమెరికా ఆంక్షలతో 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తివేసింది.