నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: జిల్లా కొమరోలు మండలంలోని చింతలపల్లి పంచాయతీలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.