'భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి'
SKLM: పలాస మున్సిపాలిటీలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 28లో ఉన్న సుమారు 1.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని 29వ వార్డు కౌన్సిలర్ జోగ మల్లేశ్వరరావు ఆరోపించారు. సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ తహసీల్ధార్కు వినతిపత్రం అందజేశారు.