VIDEO: యూరేనియం బాధితులకు జనసేన భరోసా

KDP: పులివెందుల నియోజకవర్గంలోని కేకే కొట్టాల గ్రామంలో యూరేనియం ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల పర్యావరణ హాని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులను జనసేన పార్టీ సీనియర్ నాయకులు డీఎస్పీ ప్రసాద్ పరామర్శించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు.