జిన్నారం మున్సిపాలిటీలో యూరియా కోసం పాట్లు

SRD: జిన్నారంలో యూరియా ఎరువుల కోసం మంగళవారం ఉదయం రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎరువుల కొరత కారణంగా రైతులు ఎక్కువసేపు క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. రైతులు అధికారులు తక్షణ చర్యలు తీసుకొని యూరియా సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే వానాకాలం పంటలు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు.