సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

SKLM: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పొందూరి ఎస్సై సత్యనారాయణ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే మెసేజులను నమ్మవద్దని, మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని యువతకు తెలిపారు.