రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం
AP: ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికలపాడు వద్ద ఆయిల్ ట్యాంకర్, అరటి పండ్ల లోడ్ లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.