యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి సోమవారం రూ.20,86,895, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.6,37,220, కార్ పార్కింగ్తో రూ.2,94,000, విప్ దర్శనాలతో రూ.2,47,050, బ్రేక్ దర్శనాలతో రూ.2,46,000, ప్రధాన బుకింగ్తో రూ.1,66,150, వ్రతాలతో రూ.1,51,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.