వేంపల్లి బైపాస్లో బైక్ దహనం
KDP: వేంపల్లి వద్దగల చింతలమడుగుపల్లి బైపాస్లో ఇవాళ ఓ బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. బైక్ యజమాని మాత్రం ఇంకా కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.