ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం
TPT: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు డార్లింగ్ క్లాసిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ (వేలూరు) డైరెక్టర్ మురళీ వెంకట సుబ్బు రూ.10 లక్షల విరాళం అందించారు. బుధవారం తిరుమల క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును కలిసి విరాళం డీడీ అందజేశారు. దాత సేవాభావాన్ని ఛైర్మన్ ప్రశంసించారు.