సబర్మతి జైలులో ఉగ్రవాద నిందితుడిపై దాడి

సబర్మతి జైలులో ఉగ్రవాద నిందితుడిపై దాడి

HYD: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి జైలులో హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాద నిందితుడు అహ్మద్ మొహియుద్దీన్‌పై నిన్న హింసాత్మక దాడి జరిగింది. తోటి ఖైదీలు అతనిపై దాడి చేయడంతో మొహియుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని వైద్య పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు, పరిస్థితులపై జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.