పీపీపీపై చర్చకు మేం సిద్ధం: మంత్రి కొండపల్లి
AP: పీపీపీపై చర్చకు తాము సిద్ధమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 'ప్రైవేటీకరణ, పీపీపీకి వైసీపీ నేతలు తేడా తెలుసుకోవాలి. పీపీపీ గురించి తెలియకుండానే సంతకాలు సేకరించారు. ఆ విధానంతోనే శంషాబాద్ ఎయిర్పోర్టు కట్టారు. విశాఖ ఐటీ హబ్గా తయారవుతోంది. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం' అని పేర్కొన్నారు.