VIDEO: పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత
NZB: గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రయాణికులు పోగొట్టుకున్న 20 మొబైల్ ఫోన్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ల IMEI నంబర్లను CEIR పోర్టల్లో ఆన్లైన్ చేసి, వాటిని రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ ఫోన్ల రికవరీకి కృషి చేసిన సుప్రియ, సురేందర్, గురుదాస్, సలాద్దీన్లను రైల్వే ఎస్సై సాయిరెడ్డి అభినందించారు.