'భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి'
MNCL: ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ, ఉపాధ్యక్షుడు సంకె రవి అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్ళు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన 8 గంటల పని, కనీస వేతనాలు, సామాజిక భద్రతను రద్దు చేసిన మోడీ సర్కార్కు బుద్ధి చెప్పాలని కోరారు.