ఫోన్ సిగ్నల్ ఆధారంగా వ్యక్తిని కాపాడిన పోలీసులు
NLR: నమ్మించి అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేయడం వల్ల కుటుంబాన్ని పోషించలేక చావాలనుకున్న ఓ అభాగ్యుడిని పోలీసులు గురువారం రాత్రి కాపాడారు. రవీంద్ర అనే వ్యక్తి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కందుకూరుకు చెందిన మాధవరావు తన బంధువులకు వీడియో పంపాడు. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని గుర్తించి కాపాడారు.