కంటోన్మెంట్ విలీనం పై సంతకాల సేకరణ
HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెరుగైన మౌలిక వసతులు, సమాన పౌర సేవలు, పారదర్శక పాలన కోసం తమ మద్దతు తెలిపారు. కాంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి జీహెచ్ఎంసీ విలీనం అవసరమని ప్రజలు అభిప్రాయపడ్డారు.