VIDEO: చిన్న కంభంలో కోటి సంతకాల సేకరణ
ప్రకాశం: కంభంలోని చిన్నకంభం గ్రామంలో మంగళవారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్ నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.