చిలమత్తూరులో ఉరేసుకుని వ్యక్తి మృతి

చిలమత్తూరులో ఉరేసుకుని వ్యక్తి మృతి

సత్యసాయి: చిలమత్తూరు మండలంలోని లాల్లేపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్ రెడ్డి (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. కొంతకాలంగా మృతుడు సోమందేపల్లిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామమైన లాలేపల్లి వద్ద ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటననపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.