రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
KMM: రైలు నుంచి పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఖమ్మం-పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పడి ఉన్న మృతదేహాన్ని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసినవారు 9652939431 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.