ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
PLD: వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజల సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజల అర్జీలను స్వీకరించిన ఆయన సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.