పార్టీ శ్రేణులతో కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే
ప్రకాశం: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా కనిగిరి అమరావతి గ్రౌండ్స్లో పార్టీ శ్రేణులతో కలిపి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత లభించడం సంతోషదాయకమన్నారు.