VIDEO: అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం

ప్రకాశం: కంభం పట్టణంలో కందులాపురం సెంటర్లోని ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను కంభం పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరసింహారావు పోలీసు సిబ్బందితో కలిసి రహస్యంగా దాచి ఉంచిన టపాసుల గదిని పరిశీలించారు. రూ. 3,75,000 విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచడం, అమ్మటం నేరమని హెచ్చరించారు.