'నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలి'
VZM: నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో అత్యధిక జనాభాకు ప్రయోజనం కలిగించే మూడు ప్రధాన అంశాలను ఎంపిక చేయాలని సూచించారు. నియోజక వర్గాల అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ రీజియన్, రెవెన్యూ వర్క్ షాప్స్, రీ సర్వే తదితర అంశాలపై జేసి సేధు మాధవన్తో కలిసి కలెక్టర్ సమావేశామయ్యారు.