బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రజల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో భూతగాదాలు 15, కుటుంబ కలహాలు 4, చీటింగ్ 3, నగదు వ్యవహారాలు 3, ఇతర సమస్యలు 15 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు.