శాస్త్రీయ దృక్పథంతోనే ప్రగతి: కలెక్టర్
SRPT: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని కలెక్టర్ తేజస్ అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జరిగిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన సాంకేతిక నమూనాలను అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.