ప్రజల సమస్యలు లేవనెత్తితే ఇదేనా ఫలితం?
RR: చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించిన పిలుపు నేపథ్యంలో బీజేపీ షాద్నగర్ ఇన్ఛార్జ్ అందె బాబయ్యను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు లేవనెత్తితే ఇదేనా ఫలితం అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.