బంగారం కోసం వేట.. నలుగురు మృతి

బంగారం కోసం వేట.. నలుగురు మృతి

రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి నలుగురు కూలీలను దుకాణం యజమాని పురమాయించాడు. తొలుత ఆ పని చేయడానికి నిరాకరించినా.. అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో అంగీకరించారు. బంగారం కోసం ట్యాంక్‌లో దిగిన కూలీలు ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకున్నారు.