పెదవడ్లపూడిలో రోడ్ల నిర్మాణాని శ్రీకారం
GNTR: మంత్రి లోకేశ్ చొరవతో పెదవడ్లపూడిలో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం రూ.93.90 లక్షలతో మూడు డొంక రోడ్ల నిర్మాణానికి ఏఎంసీ ఛైర్మన్ కిరణ్చంద్ గురువారం శంకుస్థాపన చేశారు. గద్దెరు బీడు, నంబూరు లాకులు, మొండి గేట్ వద్ద వీటిని నిర్మిస్తున్నారు. ఈ రోడ్లతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు సులభంగా తరలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.