ములుగు కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 46 దరఖాస్తులు రాగా, అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 13, భూ సమస్యలు 08, పెన్షన్ 05, ఇతర శాఖలకు సంబంధించినవి 20 దరఖాస్తులు స్వీకరించినట్లు, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.