అప్పుల గొడవతో గృహిణి ఆత్మహత్య
NLG: అప్పుల విషయంపై భర్తతో జరిగిన గొడవతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలం సుంకెనపల్లిలో చోటుచేసుకుంది. భర్త శేఖర్ లారీ కోసం చేసిన అప్పులపై ఫిబ్రవరి 25న గొడవపడ్డారు. మనస్తాపం చెందిన బొజ్జ పావని (35) ఒంటిపై టర్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మరణించిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.