జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భట్టి
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఆయన వెంట ఉన్నారు. వారంతా మధురానగర్, మూసాపేటలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.