మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: MLA

మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: MLA

BHPL: మహిళల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్షమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లిలో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన నేపథ్యంలో మహిళలను ఎమ్మెల్యే సన్మానించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ సేవలను వినియోగించడం వల్ల సంస్థకు కూడా ఆదాయం పెరిగిందని అన్నారు.