నారాయణస్వామికి యథావిధిగా పూజలు ప్రారంభవ
చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నిన్న చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థాన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పూజలు చేశారు. ఈరోజు నుంచి ఆలయంలో యథావిధిగా పూజలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో శ్రీగిరి రాజు నర్సింహబాబు తెలిపారు.