జలజీవం నీటి ట్యాంక్ సమస్యలతో గ్రామస్తుల ఆందోళన
కాకినాడ జిల్లా తొండంగి మండలం వలసపాకలి గ్రామంలోని జలజీవం మిషన్ నీటి ట్యాంక్ వద్ద నిర్లక్ష్య పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ట్యాంక్ పరిసరాల్లో మట్టి గుట్టలు, చెత్త పేరుకుపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా కేంద్రం వద్ద శుభ్రత లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.