BREAKING: ‘అఖండ2’ టికెట్‌ ధరలు పెంపు

BREAKING: ‘అఖండ2’ టికెట్‌ ధరలు పెంపు

బాలకృష్ణ 'అఖండ-2' చిత్రానికి AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మూవీ ఈనెల 5న విడుదల కానుండగా, 4న ప్రీమియర్ షో (రూ.600) ప్రదర్శించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, 5వ తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది.