చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసింది: MLA

చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసింది: MLA

VKB: చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని తాండూర్ MLA మనోహర్ రెడ్డి అన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న MLA చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.