పలిమెలలో ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యుల సమావేశం
BHPL: పలిమెల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్పంచ్ పుష్పలత తిరుపతి హాజరై మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒకపూట భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు.