ఆదోనిలో రేపు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభ
కర్నూలు: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రేపు ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వికలాంగుల సంఘం నాయకులు దుగ్గప్ప, హనుమంత రెడ్డి తెలిపారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి ఆదోని డివిజన్లోని దివ్యాంగులు అందరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.