గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యం
AP: కోనసీమ జిల్లా బొబ్బర్లంక వద్ద గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరిలో నిన్న ముగ్గురు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం సుల్తాన్ అహ్మద్(22), మహ్మద్ అల్ఫాద్(18) మృతదేహాలు లభ్యం కాగా, నిన్ననే బిలాల్(27) మృతదేహం లభ్యమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తుమ్మలోవకు చెందిన వారిగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.