ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యచరణ పై ఎంపీడీవో ముత్యాల రావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ ప్రగతి ప్రణాళిక మీద మార్చి 6 నుండి జూన్ 12 వరకు చేయవలసిన పనులు మీద తగు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మీద ఈ సమావేశానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.