రహదారి విస్తరణ పనులు ప్రారంభం
KRNL: కర్నూలు బళ్లారి చౌరస్తా వద్ద ఆంజనేయస్వామి గుడి వెనుక 42వ వార్డులో బస్టాండ్కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రహదారి విస్తరణ పనులు ప్రారంభించారు. మంత్రి భరత్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. రహదారి విస్తరణ పూర్తయితే బస్టాండ్కు వెళ్లే ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని టీడీపీ నాయకులు తెలిపారు.