6 కోట్లు వ్యయంతో కొత్త గోదాములు

కృష్ణా: మచిలీపట్నంలోని మార్క్ఫెడ్ గోదాములను రాష్ట్ర మార్క్ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు శుక్రవారం పరిశీలించారు. 6 కోట్లు వ్యయంతో కొత్త గోదాములు నిర్మించేందుకు బోర్డు నిర్ణయించిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో PACS ద్వారా 12,627 మెట్రిక్ టన్నుల యూరియా, రైతు సేవ కేంద్రాల ద్వారా 392 టన్నులు రైతులకు సరఫరా చేశామని వెల్లడించారు.