విద్యాశాఖ కార్యాలయానికి ఏసీబీ అధికారులు
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు పలు వివరాలను సేకరించారు. ఏసీబీ డీఎస్పీ, ఇద్దరు సీఐలు డీఈవో కార్యాలయానికి రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కలెక్టర్తో సమీక్షలో ఉండడంతో ఏసీబీ అధికారులు సిబ్బంది ద్వారా వివరాలను సేకరించారు.