జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: SI
MHBD: జిల్లా కోర్టులో ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బయ్యారం మండల ఎస్సై తిరుపతి కోరారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, ఆస్తి తగాదాలు, కుటుంబ, వైవాహిక కేసుల్లో రాజీ ద్వారా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాజీ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.