‘ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం’
సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన వినతులను తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.